న్యూఢిల్లీ: సైనికుల్ని పెద్ద సంఖ్యలో తరలించే ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధ నౌక పలు విన్యాసాలు చేసింది. గుజరాత్ సముద్ర తీరంలోని గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఆర్మీ, వాయు సేనతో కలిసి సంయుక్తంగా డ్రిల్స్ నిర్వహించింది. దేశ సముద్ర తీర ప్రాంతం పరిరక్షణ, జాతీయ భద్రతను పెంపొందించడానికి తీర ప్రాంతాలతోపాటు హిందూ మహాసముద్రం అంతటా ఇలాంటి యుద్ధ నౌకలను మోహరించినట్లు భారత నౌకాదళం తెలిపింది.
కాగా, ఐఎన్ఎస్ జలాశ్వ, ఉభయచర రవాణా రేవు వంటింది. 2005లో ఆరు సీకోర్స్కై ఎస్హెచ్-3 సీ కింగ్ హెలికాప్టర్లతో సహా ఈ యుద్ధ నౌకను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది. 2007 జూన్ 22 నుంచి భారత నౌకా దళానికి సేవలందిస్తున్నది. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఏకైన యుద్ధ నౌక ఐఎన్ఎస్ జలాశ్వ. ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ కింద ఇది సేవలందిస్తున్నది.
మరోవైపు ఇండియన్ నేవీ, బంగ్లాదేశ్ నేవీ కోఆర్డినేటెడ్ పెట్రోల్ (CORPAT) నాల్గవ ఎడిషన్ ఆదివారం ప్రారంభమైంది. ఉత్తర బంగాళాఖాతంలో ప్రారంభమైన ఈ డ్రిల్ సోమవారం కూడా కొనసాగింది. భారత నావికా దళానికి చెందిన స్వదేశీ యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ కోరా, ఐఎన్ఎస్ సుమిధాతోపాటు బంగ్లాదేశ్ నౌకాదళానికి చెందిన బీఎన్ఎస్ అలీ హైదర్, బీఎన్ఎస్ అబు ఉబైదా యుద్ధ నౌకలు ఈ పెట్రోలింగ్లో పాల్గొన్నాయి.
Indian Navy’s largest troop carrier INS Jalashwa carried out joint amphibious drills in the Gulf of Kachchh off the coast of Gujarat involving Air Force and Indian Army elements: Indian Navy officials pic.twitter.com/KWJSLRZqXv
— ANI (@ANI) May 23, 2022