నాగపూర్: మహారాష్ట్ర సర్కారుకు సిరా దాడి భయం పట్టుకుంది. అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్పై ఇటీవల నిరసనకారులు ఇంకు చల్లిన సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర శాసనసభ పరిసరాల్లోకి ఇంకు పెన్నులు తీసుకురావడాన్ని అనుమతించరాదని ప్రభుత్వ నిర్ణయించింది.
ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న నాగపూర్ అసెంబ్లీ పరిసరాల్లోకి ప్రవేశించేవారి పెన్నులను భద్రతా సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఇంకుపెన్నులుంటే వెనుకకు పంపేస్తున్నారు.