న్యూఢిల్లీ: విద్యా సంస్థల టీచింగ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నదని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఎంపిక ప్యానెళ్లు పక్షపాతంతో వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నాయని తెలిపింది. ‘ఎస్సీ, ఎస్టీల సామాజిక-ఆర్థికాభివృద్ధిలో సెంట్రల్ వర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, ఐఐఎమ్లు, ఐఐటీలు, వైద్య సంస్థలు, నవోదయ, సెంట్రల్ స్కూళ్లతో కూడిన స్వయం ప్రతిపత్తి సంస్థలు, విద్యా సంస్థల పాత్ర’ అంశంపై కమిటీ మంగళవారం పార్లమెంట్కు నివేదిక సమర్పించింది.