పాట్నా: బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు సమాజాన్ని అణచివేస్తున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. బీహార్లో బహుజనులకు జరిగిన అన్యాయం భయానక చిత్రమని ఆవేదన వ్యక్తం చేశారు. నవాడ జిల్లాలో కొందరు దుండగులు దళితుల ఇళ్లకు నిప్పుపెట్టిన సంఘటనపై ఆయన స్పందించారు. ‘ఇళ్లు, ఆస్తులను కోల్పోయిన దళిత కుటుంబాల రోదనలు. భీకర కాల్పుల ప్రతిధ్వనులు కూడా నిద్రపోతున్న బీహార్ ప్రభుత్వాన్ని మేల్కొపడంలో విజయవంతం కాలేదు’ అని మండిపడ్డారు.
కాగా, బహుజనులను భయపెట్టే అరాచకవాదులకు ఎన్డీయే ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇలాంటి సంఘటనలపై ప్రధాని మోదీ మౌనం వహించడం పెద్ద కుట్రకు ఆమోద ముద్ర వేయడమేనని అన్నారు. అవమానకర నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించడంతోపాటు వారికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ సంఘటనపై స్పందించారు. దళితులపై అఘాయిత్యాలను సహించేది లేదన్నారు. సీఎం నితీశ్ కుమార్ నిద్ర నుంచి మేల్కొని మౌనాన్ని వీడాలని అన్నారు. ‘బీహార్లో మూడో అతిపెద్ద పార్టీకి చెందిన ముఖ్యమంత్రి నెలల తరబడి మాట్లాడటం మానేశారు. బీహార్పై కానీ, నేరగాళ్లపై కానీ ఎన్డీయేకు పట్టింపు లేదు’ అని ఎక్స్లో మండిపడ్డారు.
కాగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ సంఘటనపై స్పందించారు. బీహార్ ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల పునరావాసానికి ఆర్థిక సాయం చేయాలని ఆమె కోరారు.
नवादा में महादलितों का पूरा टोला जला देना, 80 से ज़्यादा परिवारों के घरों को नष्ट कर देना बिहार में बहुजनों के विरुद्ध अन्याय की डरावनी तस्वीर उजागर कर रहा है।
अपना घर-संपत्ति खो चुके इन दलित परिवारों की चीत्कार और भयंकर गोलीबारी की गूंज से वंचित समाज में मचा आतंक भी बिहार की…
— Rahul Gandhi (@RahulGandhi) September 19, 2024
महा जंगलराज! महा दानवराज! महा राक्षसराज!
नवादा में दलितों के 100 से अधिक घरों में लगायी आग।
नरेंद्र मोदी और नीतीश कुमार के राज में बिहार में आग ही आग।
मुख्यमंत्री नीतीश कुमार बेफिक्र, NDA के सहयोगी दल बेख़बर! गरीब जले, मरे-इन्हें क्या? दलितों पर अत्याचार बर्दाश्त नहीं होगा।…
— Tejashwi Yadav (@yadavtejashwi) September 18, 2024
बिहार के नवादा में दबंगों द्वारा गरीब दलितों के काफी घरों को जलाकर राख करके उनका जीवन उजाड़ देने की घटना अति-दुखद व गंभीर। सरकार दोषियों के खिलाफ सख्त कानूनी कार्रवाई करने के साथ ही पीड़ितों को पुनः बसाने की व्यवस्था के लिए पूरी आर्थिक मदद भी करे।
— Mayawati (@Mayawati) September 19, 2024