Madhya Pradesh | ఇండోర్: ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం కోసం ఓ మహిళ తన 47వ పుట్టిన రోజునాడు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. వీరి పెండ్లి ఈ నెల 11న జరుగబోతున్నది. వీరిద్దరూ స్పెషల్ మ్యారే జ్ యాక్ట్ ప్రకారం పెండ్లి చేసుకుని, ఫ్యామిలీ కోర్టు నుంచి వివాహ ధ్రువపత్రాన్ని గురువారం స్వీకరించారు. ఆస్తా, అల్కా సోని మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందినవారు.
అల్కా జన్మతః స్త్రీ. అయితే కొన్నేండ్ల తర్వాత తాను స్త్రీని కాదని, పురుషుడిననే భావన ఆమెకు కలిగింది. అప్పటి నుంచి ఆమె తన పేరు అస్తిత్వగా మార్చుకొన్నది. అస్తిత్వ సోదరితో ఆస్తాకు స్నేహం ఉంది. దీంతో ఆస్తా ఆ అన్నా చెల్లెళ్ల ఇంటికి వెళ్తూ ఉండేవారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి.