భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరో ఘనత సాధించింది. ఐదు వేల మందికిపైగా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు మానవ గొలుసుగా ఏరడ్పి అతి పెద్ద భారత్ మ్యాప్ను రూపొందించారు. దీంతో ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. 75 ఏళ్ల స్వతంత్ర వేడుకలైన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘జ్వాలా’ సామాజిక సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. శనివారం ఇండోర్లోని దివ్య శక్తిపీఠంలో భారత చిత్రపటం రూపంలో 5,335 మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు గొలుసుకట్టుగా నిల్చున్నారు. అతి పెద్ద మానవ గొలుసుగా ఏర్పడి దేశం మ్యాప్ను రూపొందించినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది.
కాగా, ఈ కేటగిరీలో ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేసినట్లు జ్వాలా సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ దివ్య గుప్తా తెలిపారు. కేవలం భారత్ మ్యాప్ బోర్డర్లోనే కాకుండా లోపల కూడా జాతీయ జెండా రంగులు, అశోక చక్రం రూపంలో జనం గొలుసుకట్టుగా ఏర్పడినట్లు చెప్పారు. దేశంలోని మహిళల ప్రాముఖ్యత, శక్తిని చాటేలా భారత్ మ్యాప్ బోర్డర్ చూట్టూ మహిళలను ఉంచినట్లు వెల్లడించారు.
Indore sees World Book of Records for largest human chain forming India's map
Read @ANI Story | https://t.co/6Gj0OCMHMM#IndiaAt75 #Indore #AzadiKaAmritMahotsav #IndependenceDay2022 pic.twitter.com/PDzDg2zCt8
— ANI Digital (@ani_digital) August 14, 2022