ఇండోర్, ఏప్రిల్ 30: ఇండోర్ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నామినేషన్ వేసిన మరునాడే అక్షయ్ బామ్ మీద 17 ఏండ్ల పాత ఘటనలో హత్యాయత్నం ఆరోపణలపై కేసు నమోదైంది.
ఆయనపై ఓ భూవివాదానికి సంబంధించి కేసు ఇండోర్ జిల్లా కోర్టులో 17 ఏండ్లుగా పెండింగ్లో ఉంది. అయితే, నామినేషన్ వేసిన మరునాడే ఏప్రిల్ 24న ఈ కేసులో అక్షయ్పై అదనంగా హత్యాయత్నం సెక్షన్ను కూడా చేర్చినట్టు కోర్టు రికార్డుల్లో నమోదైంది.