అమృత్సర్, ఏప్రిల్ 11: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బీంట్సింగ్ కుమారుడు సరబ్జీత్సింగ్ ఖల్సా (45) లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. ఇంటర్ డ్రాపౌట్ అయిన ఆయన ఫరీద్కోట్ (రిజర్వుడు) స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీచేస్తున్నారు. గతంలో ఆయన 2014లో ఫతేగఢ్ సాహిబ్ (రిజర్వుడు) స్థానం నుంచి, 2019లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా బటిండా నుంచి పోటీచేసి రెండుసార్లూ ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సరబ్జీత్సింగ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులను రూ. 3.5 కోట్లుగా పేర్కొన్నారు.