ఢిల్లీ నుంచి దియోగఢ్ (జార్ఖండ్)కు వెళ్లాల్సిన విమానం హఠాత్తుగా రద్దు కావటంతో ఢిల్లీ విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు నిరసనకు దిగారు. ‘బంద్ కరో.. బంద్ కరో’ అంటూ కొంతమంది ప్రయాణికులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఆందోళన చేపట్టారు.
తాము ప్రయాణించాల్సిన విమానం హఠాత్తుగా రద్దు కావటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.