బెంగళూరు: విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ (emergency exit door) తెరిచేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో విమాన సంస్థ ఫిర్యాదుతో ఆ ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 30న ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానం మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి బెంగళూరు మీదుగా థాయ్లాండ్కు ప్రయాణించింది. విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ విమాన సిబ్బంది, మిగతా ప్రయాణికులు ఆందోళన చెందారు. అతడిని నిలువరించారు.
కాగా, ఆ విమానం బెంగళూరులో ల్యాండ్ కాగానే ఎయిర్పోర్ట్లోని పోలీసులకు దీని గురించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్వప్నిల్ హోల్ అనే ప్రయాణికుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.