న్యూఢిల్లీ: ఇండియా సెకండ్ వేవ్లో భాగంగా కనిపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ గత వేరియంట్తో పోలిస్తే రెండు నుంచి రెండున్నర రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఈ అధ్యయనం నిర్వహించాయి. ఈ కొత్త వేరియంట్ బారిన పడిన వ్యక్తి మరో ముగ్గురికి ఈ వైరస్ అంటించగలరని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.
పెరిగిన R0 అనేది కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాపింపజేయగలదనడానికి సూచిక. అందుకే ఇండియాలో సెకండ్ వేవ్లో భాగంగా ఎక్కువ మంది వైరస్ బారిన పడ్డారు అని ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, టీఐఎఫ్ఆర్కు చెందిన సందీప్ జునేజా వెల్లడించారు. ఒకవేళ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరిగి, మరో కొత్త వేరియంట్ రాకపోతే జూన్ 1 కల్లా ముంబైలో మరణాల రేటు గణనీయంగా తగ్గిపోతుందని కూడా ఈ అధ్యయనం తేల్చింది.
మే మొదటి వారంలో ముంబైలో మరణాలు రేటు పీక్ స్టేజ్కు చేరుతుందని అంచనా వేసిన ఈ అధ్యయనం.. జులై 1 కల్లా పూర్తిగా కోలుకొని స్కూళ్లు తెరిచే స్థాయికి వెళ్తుందని చెప్పడం విశేషం. నిజానికి మహారాష్ట్రలో ఫిబ్రవరి నెలలోనే ఈ కొత్త వేరియంట్ ఉన్నదని, అయితే లోకల్ రైళ్లను ప్రారంభించడంతో అది శరవేగంగా వ్యాపించినట్లు తెలిపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఈ కొత్త వేరియంట్ ముంబై నగరంలో 2.4 లక్షల మందికి సోకగా.. 1479 మంది మరణించారు. మే 1న ఒక్క రోజే ముంబైలో 90 మంది మరణించారు.