తిరువనంతపురం, జూలై 30: దేశంలో మంకీపాక్స్ తొలి రోగి పూర్తిగా కోలుకున్నాడు. ఈ నెల 12న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు వచ్చిన సదరు వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో దవాఖానలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతడు పూర్తిగా కోలుకున్నాడని కేరళ వైద్యశాఖ మంత్రి వీనా జార్జ్ చెప్పారు. ‘మంకీపాక్స్కు సంబంధించి రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అతడి శరీరంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోయాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు’ అని మంత్రి తెలిపారు.