న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం రాత్రి 7 గంటల వరకు కరోనా టీకాల పంపిణీ 165.6 కోట్లు దాటింది. శనివారం ఒక్కరోజే 53 లక్షల మందికి పైగా కొవిడ్ వ్యాక్సిన్ను తీసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 18 నుంచి 44 ఏండ్ల వయసున్న వారిలో 53,96,51,188 మంది మొదటి డోసు తీసుకోగా, 40,19,58,479 మంది రెండు డోసులు తీసుకున్నారు.
మొత్తం దేశ వ్యాప్తంగా 93,87,16,725 మొదటి డోసు తీసుకోగా, 70,57,49,826 మంది రెండు డోసులు తీసుకున్నారు. 15 నుంచి 18 ఏండ్ల వయసున్న వారిలో 4,55,48,237 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 1,16,18,975 మంది బూస్టర్ డోసు తీసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.