న్యూఢిల్లీ, జూలై 11: ఆన్లైన్ టికెట్ బుకింగ్ కోసం భారతీయ రైల్వే ఒక నూతన వెబ్సైట్ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. ఈ కొత్త ప్లాట్ఫామ్కు చెందిన బీటా వెర్షన్పై ఐఆర్సీటీసీ పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. అప్గ్రేడ్ చేసిన ఈ వెబ్సైట్ నెమ్మదిగా జరుగుతున్న అప్లోడింగ్, సంక్లిష్టమైన క్యాప్చాలు, తరచుగా వచ్చే పాప్-అప్లు వంటి ప్రయాణికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నది.