న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓహియో రాష్ట్రంలో ఒకరు మరణించారని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ శుక్రవారం పేర్కొన్నది. భారతీయ లేదా భారత సంతతికి చెందిన విద్యార్థులు మృతిచెందిన ఘటనల్లో ఈ ఏడాదిలో ఇది పదోది కావడం గమనార్హం.
కాగా, విద్యార్థి మృతికి గల కారణం తెలియరాలేదని, దర్యాప్తు జరుగుతున్నదని తెలిపింది. మృతుడిని గద్దె ఉమా సత్యసాయిగా గుర్తించారు. ఇతను క్లెవెలాండ్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. సత్యసాయి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాన్సులేట్.. విద్యార్థి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు పంపేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపింది.