బెంగళూరు: జాబిల్లిపై విజయవంతంగా అడుగుపెట్టిన భారత్ తన రాకను ఘనంగా చాటుకున్నది. భారత్ చంద్రుడిపై దిగినందుకు గుర్తుగా అక్కడ జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను ఉపరితలంపై ముద్రించింది. కుడి వైపు చక్రాలు జాతీయ చిహ్నాన్ని, ఎడమ వైపు చక్రాలు ఇస్రో లోగోను ముద్రించేలా డిజైన్ చేశారు. డిజైన్కు అనుగుణంగా జాబిల్లి ఉపరితలంపై భారత ముద్ర పడింది.