న్యూఢిల్లీ: భారత కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పతనమవుతున్నది. సోమవారం నాటి ఎర్లీ ట్రేడింగ్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 43 పైసలు పతనమై రూ.81.52కు చేరింది. ఎర్లీ ట్రేడింగ్లో రూపాయి అత్యంత బలహీనంగా రూ.81.52 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత రికార్డు స్థాయిలో రూ.81.55 పైసలకు పడిపోయింది. తర్వాత పుంజుకుని రూ.81.52 వద్ద కొనసాగుతున్నది.
అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం కావడానికి ప్రధాన కారణం.. ఆ దేశపు ఫెడ్ రిజర్వ్ వరుసగా మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచడం. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం అమెరికా వడ్డీ రేట్లను పెంచుతూ పోతుండటంతో డాలర్ బలపడుతున్నది. దాంతో రూపాయితోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు అన్నీ నష్టపోతున్నాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే ప్రమాదం ఉంది. అదేగనుక జరిగితే రూపాయి విలువ మరింత పతనం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయిని బలపర్చడం కోసం తదుపరి ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ తీసుకోబోయే నిర్ణయం కీలకం కానున్నది.