Rescue: ఇటీవల సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసిన నౌకలోని మత్స్యకారులను రక్షించేందుకు భారత నేవీకి చెందిన యుద్ధనౌక INS సుమిత్ర వెళ్లింది. సముద్ర దొంగల చెర నుంచి మత్స్యకారులను విడిపించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నది. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
కేరళలోని కొచ్చి నగరానికి పశ్చిమంగా 700 నాటికల్ మైళ్ల దూరంలో ఆరేబియా సముద్రంలో సోమాలియా సముద్ర దొంగలు ఇరాన్కు చెందిన మత్స్యకారుల బోటు ‘MV ఇమాన్’ను హైజాక్ చేశారు. బోటులోని 17 మంది సిబ్బందిని తమ బందీలుగా చేసుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రస్తుతం INS సుమిత్ర రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నది.