INS Kolkata : భారత నావికా దళం 35 మంది సముద్ర దొంగలను అదుపులోకి తీసుకుంది. సముద్ర దొంగలు హైజాక్ చేసిన MV Ruen వాణిజ్య నౌకను వారి చెర నుంచి విడిపించింది. ఇండియన్ నేవీ అధికారులు భారత యుద్ధ నౌక INS Kolkata లో వెళ్లి ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా సముద్ర దొంగలను లొంగదీసి అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం హైజాక్కు గురైన వాణిజ్య నౌక MV Ruen లోని 17 మంది సిబ్బందిని, పట్టుబడిన 35 మంది సముద్ర దొంగలను తీసుకుని INS Kolkata భారత పశ్చిమ తీరానికి వస్తోంది. ఈ విషయాన్ని భారత నేవీ అధికారులు వెల్లడించారు.