చెన్నై: భారతీయ వైద్య విద్యార్థి చైనాలో మరణించాడు. దీంతో అతడి మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని పేద కుటుంబం అభ్యర్థించింది. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల అబ్దుల్ షేక్, వైద్య విద్య చివరి ఏడాది చదువుతున్నాడు. గత ఐదేళ్లుగా చైనాలో విద్యనభ్యసిస్తున్నాడు. ఇటీవలే తమిళనాడుకు తిరిగి వచ్చిన ఆ విద్యార్థి డిసెంబర్ 11న తిరిగి చైనా వెళ్లాడు. ఎనిమిది రోజులు తప్పనిసరి ఐసోలేషన్ తర్వాత, హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని క్వికిహార్ మెడికల్ యూనివర్శిటీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు.
కాగా, వైద్య విద్యార్థి అబ్దుల్ షేక్ ఇటీవల చైనాలో అనారోగ్యానికి గురయ్యాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషయం తెలిసి తమిళనాడులోని ఆ విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. తమ కుమారుడి మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని విదేశాంగ మంత్రిత్వశాఖను కోరారు. అలాగే తమకు సహాయం చేసి ఆదుకోవాలని తమినాడు ప్రభుత్వాన్ని కూడా ఆ పేద కుటుంబం విజ్ఞప్తి చేసింది.