న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసర్చ్ సెంటర్కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించనున్నది. చిరుధాన్యాల అధ్యయనం చేపడుతున్న ఆ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా సపోర్ట్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని చెప్పారు. టెక్నాలజీ ఆధారిత చిరుధాన్యాల అభివృద్ధి కోసం ఆ ఇన్స్టిట్యూట్ పనిచేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్రీ అన్నాను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
చిరుధాన్యాలను అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న దేశంగా ఇండియా నిలుస్తుందని, చిరుధాన్యాలను ఎగుమతి చేస్తున్న రెండవ అతిపెద్ద దేశంగా కూడా ఇండియా ఉందన్నారు. శ్రీ అన్న స్కీమ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు.. హైదరాబాద్లోని మిల్లెట్ రీసర్చ్ కేంద్రాన్ని.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి నిర్మల తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఉత్తమ విధానాలను ఆ కేంద్రంలో పరీక్షించనున్నట్లు ఆమె చెప్పారు.
అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ను 20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. డెయిరీ, పశు సంవర్ధకశాఖ, మత్స్య శాఖలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు.
Agriculture Credit Target to be increased to Rs. 20 lakh crores, with focus on animal husbandry, dairy, and fisheries
A new sub-scheme of PM Matsya Sampada Yojana to be launched, with a targeted investment of Rs. 6000 crores#AmritKaalBudget #Budget2023 pic.twitter.com/q0pJSWWIC4
— PIB India (@PIB_India) February 1, 2023