న్యూఢిల్లీ : దుబాయ్లో పనిచేస్తున్న ఓ ఇండియన్ డ్రైవర్ యూఏఈలో కొత్త ఏడాది తొలి రోజే కోట్లు గెలుచుకున్నాడు. డిసెంబర్ 31న జరిగిన బిగ్ టికెట్ (Big Ticket) లైవ్ డ్రాలో జాక్పాట్ ప్రైజ్ 20 మిలియన్ యూఏఈ దీర్హాంలు (దాదాపు రూ. 44 కోట్లు) గెలుచుకున్నాడు. గల్ఫ్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం సిరీస్ 259 బిగ్ టికెట్ లైవ్ డ్రాలో మునావర్ ఫైరూస్ లక్కీ విన్నర్గా నిలిచి న్యూ ఇయర్ను జోష్తో ప్రారంభించాడు.
ఫైరూస్ గత ఐదేండ్లుగా ప్రతి నెలా కొనుగోలు చేస్తుండగా బిగ్ విన్ గురించి తెలిసి షాక్కు గురయ్యాడు. అయితే ఇంత భారీ మొత్తం అతడు ఒక్కడే గెలుచుకోలేదు. టికెట్ కొనుగోలుకు కంట్రిబ్యూట్ చేసిన మరో 30 మంది వ్యక్తులతో ఈ మొత్తాన్ని పంచుకోనున్నాడు. ఈ భారీ జాక్పాట్ తనకు దక్కుతుందని ఊహించలేదని, కొద్ది సమయం తర్వాత ఈ నగదును ఎలా ఖర్చు చేయాలన్నది ఆలోచిస్తామని ఫైరూస్ చెప్పుకొచ్చాడు.
ఇక అదే రోజు మరో ఇండియన్ సుథేష్ కుమార్ కుమరేశన్ డిసెంబర్ మాసానికి ఈ-డ్రా విన్నర్గా నిలిచి పది లక్షల యూఏఈ దీర్హాంలు (రూ. 2.26 కోట్లు) గెలుపొందాడు. కుమరేశన్ ఎతిహాద్ ఎయిర్వేస్లో ఇంజనీర్గా పనిచేస్తూ అబుదాబిలో నివసిస్తున్నాడు. తాను ప్రయాణం చేసే ప్రతిసారి అబుదాబి ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ ఇన్ స్టోర్ కౌంటర్స్ వద్ద ఆగి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటానని కుమరేశన్ చెప్పుకొచ్చాడు.
Read More :