రాంచి, మార్చి 21: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన దరిమిలా హొర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయి రాంచీకి చెందిన మెర్చంట్ నేవీ మాజీ అధికారి కెప్టెన్ రాకేశ్ రంజన్ సింగ్(47) గుండెపోటుతో మరణించారు. అయన అనే నౌకలో పనిచేసేందుకు ఫిబ్రవరి 2న రాకేశ్ రాంచీ నుంచి దుబాయ్కు బయల్దేరినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చమురు కన్సైన్మెంట్ని లోడ్ చేసుకుని భారత్కు పయనమయ్యేందుకు మార్చి 1న ఆ నౌక హొర్ముజ్ జల సంధిలోకి ప్రవేశించింది. అయితే ఆ ప్రాంతంలో యుద్ధ పరిస్థితి నెలకొనడంతో ఆ నౌక సముద్రంలో చిక్కుకుపోయింది. గడచిన 18 నుంచి 20 రోజులుగా అయన నౌక దుబాయ్కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయిందని కుటు ంబ సభ్యులకు సమాచారం అందించింది. సముద్రంలో సుదీర్ఘకాలం చిక్కుకుపోవడంతో మార్చి 18న హఠాత్తుగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆయన దుబా య్లో దవాఖానకు చేరకముందే గుండెపోటుతో మరణించారు.