న్యూఢిల్లీ, మే 20: భారత ఆర్మీలో అగ్నివీర్ల నియామకానికి జరిగిన పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఆర్మీ అగ్నివీర్ సీఈఈ రాతపరీక్ష – 2023కు హాజరైన అభ్యర్థులు joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయాలు(ఏఆర్వో)ల వారీగా పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను పీడీఎఫ్ల రూపంలో ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. శనివారం విడుదల చేయని పలు ఏఆర్వోల ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 375 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 26 వరకు అగ్నివీర్ నియామక పరీక్ష జరిగింది.