జైసల్మేర్, డిసెంబర్ 24: రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కి చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో విమాన పైలట్గా ఉన్న వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మృతిచెందినట్టు ఐఏఎఫ్ ట్విట్టర్లో అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నది. ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన ఐఏఎఫ్.. బాధితుడి కుటుంబసభ్యులకు అండగా ఉంటామని తెలిపింది. శిక్షణలో భాగంగా పశ్చిమ సెక్టార్లో తిరుగుతున్న సమయంలో సామ్ పోలీసుస్టేషన్ పరిధిలోని డెజర్ట్ నేషనల్ పార్క్(డీఎన్పీ) ఏరియాలో విమానం కూలిందని జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి స్థానిక పోలీసులు చేరుకున్నారని చెప్పారు.