న్యూఢిల్లీ: రాబోయే రెండు దశాబ్దాల్లో 350 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) యోచిస్తోందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇండియన్ ఏరోస్పేస్ రంగాన్ని శక్తివంతం చేసేందుకు దేశీయ తయారీ సంస్థలపై దృష్టిపెడతామని అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ)తో సహా 350 ఎయిర్క్రాఫ్ట్లను సమాకూర్చుకోవాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భావిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు విమానాల అవసరం, వాటి సముపార్జన గురించి ఎయిర్ వైస్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ వివరించారు.