SCO summit | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఒప్పందాల ఉల్లంఘన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల మూలాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనాను భారత్ హెచ్చరించింది. గాల్వాన్ సంఘటన తర్వాత ఇరుదేశాల రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ ఈ మేరకు చైనాకు బలమైన సందేశాన్ని పంపింది.
షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశాన్ని పురస్కరించుకుని చైనాకు చెందిన లెఫ్ట్నెంట్ జనరల్ లీ షాంగ్ఫూతో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. భారత్-చైనా సరిహద్దు వద్ద ఉన్న శాంతి, ప్రశాంత పరిస్థితుల ఆధారంగానే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు.