న్యూఢిల్లీ: రష్యాలోని కజన్ సిటీలో జరగనున్న 16వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అక్టోబర్ 22 నుంచి ఆ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాలకు చెందిన నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని భారత గౌరవిస్తుందని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. గ్లోబల్ డెవలప్మెంట్ ఎజెండా, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, సంస్కృతి, సంప్రదాయల ప్రమోషన్ లాంటి అంశాల్లో చర్చించనున్నట్లు మోదీ తెలిపారు.
Leaving for Kazan, Russia, to take part in the BRICS Summit. India attaches immense importance to BRICS, and I look forward to extensive discussions on a wide range of subjects. I also look forward to meeting various leaders there.https://t.co/mNUvuJz4ZK
— Narendra Modi (@narendramodi) October 22, 2024