భువనేశ్వర్: అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్(Agni Prime Missile)ను ఇవాళ ఇండియా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఆ పరీక్షను చేపట్టారు. ఇవాళ ఉదయం 9.45 నిమిషాలకు ఆ పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది. రక్షణశాఖ అధికారులు దీనికి సంబంధించిన ప్రకటన చేశారు.
పరీక్ష సమయంలో క్షిపణి సుదీర్ఘ దూరం ప్రయాణించినట్లు తెలిపారు. టెస్ట్ లక్ష్యాలను విజయవంతంగా చేరుకున్నట్లు అదికారులు వెల్లడించారు. అగ్ని ప్రైమ్ మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించడం ఇది మూడవసారి. ఈ పరీక్ష ద్వారా మిస్సైల్ సిస్టమ్ అక్యురసీ, రిలయబిలిటీ తేలిందని డిఫెన్స్ అధికారులు చెప్పారు.
రేడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా క్షిపణి పర్ఫార్మెన్స్ను అంచనా వేశారు.