న్యూఢిల్లీ, జూన్ 2 : ఆపరేషన్ సిందూర్లో తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించిన క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ఎస్-400’కు సంబంధించి రష్యా కీలక ప్రకటన చేసింది. వీటికి సంబంధించి భారత్కు ఇవ్వాల్సిన మిగిలిన రెండు యూనిట్లను 2026లోగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని రష్యా అధికారి రోమన్ బాబుష్కిన్ సోమవారం చెప్పారు.
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ వీటి పనితీరు చాలా బాగుందని అన్నారు. గగనతల రక్షణ, యాంటీ డ్రోన్ సిస్టంపై భారత్తో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించాలని అన్నారు.