న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 8,895 కరోనా కేసులు (Corona) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,33,255కు చేరింది. ఇందులో 3,40,60,774 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,73,326 మంది కరోనాకు బలవగా, 99,155 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, కొత్తగా 2,796 మంది మరణించగా, 6,918 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
కరోనా రికవరీరేటు 98.35 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.29 శాతం అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,27,61,83,065 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 138 కోట్ల డోసులు పంపిణీ చేశామని, ఇంకా 21.13 కోట్లు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపింది.