న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆరుగురు చనిపోయారు. మరో 929 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో బాధితుల సంఖ్య కు చేరాయి. ఇందులో 4,25,03,383 మంది కోలుకున్నారు. 5,21,691 మంది మరణించగా, ఇంకా 11,058 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్గా ఉన్నది 0.03 శాతం మాత్రమేనని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటిరకు 1,85,74,18,827 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో నిన్న ఒక్కరోజే 2,44,870 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది.