న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 6,915 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 180 మంది మరణించారు. కరోనా నుంచి 16,864 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 92,472 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
COVID19 | India reports 6,915 new cases, 180 deaths and 16,864 recoveries; Active caseload stands at 92,472 pic.twitter.com/y7aTnAUM8k
— ANI (@ANI) March 1, 2022