న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా 374 మంది మరణించారు. కరోనా నుంచి మరో 7,051 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 77,516 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలిపింది. మరణాల సంఖ్య 4,79,133కు చేరింది. ఇప్పటి వరకు 1,40,31,63,063 మంది కొవిడ్ టీకా తీసుకున్నారు.
ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 358కి చేరుకోగా అత్యధికంగా మహారాష్ట్రలో 88 కేసు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 67, తెలంగాణలో 38, తమిళనాడు 34, కర్ణాటక 31, గుజరాత్ 30, కేరళ 27, రాజస్థాన్లో 22 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.