న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,99,691కి పెరిగింది. ఇందులో 3,42,43,945 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 4,80,290 మంది మరణించారు. మరో 75,456 మంది బాధితులు మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో మరో 293 మంది మరణించగా, 6450 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 98.40 శాతం, పాజిటివిటీ రేటు 0.64 శాతంగా ఉందని తెలిపింది.
ఇక దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 653కు చేరాయని ప్రకటించింది. ఇందులో మహారాష్ట్రలో అత్యధికగా 167 కేసులు నమోదయ్యాయని తెలిపింది. దేశరాజధాని ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్ 49, రాజస్థాన్లో 46 చొప్పున ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయని వెల్లడించింది. అయితే ఇప్పటివరకు 186 మంది బాధితులు కరోనా కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారని తెలిపింది.
దేశంలో 142.47 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొంది. ఇందులు నిన్న ఒక్కరోజే 72,87,547 మందికి టీకా వేశామని వెల్లడించింది.