న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 5,921 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,57,477కి చేరింది. ఇందులో 4,23,78,721 మంది కరోనా నుంచి బయటపడగా, 5,14,878 మంది బాధితులు మరణించారు. మరో 63,878 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 289 మంది కరోనా వల్ల మరణించగా, 11,651 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.63 శాతానికి పడిపోయిందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.15 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని పేర్కొన్నది. ఇక దేశవ్యాప్తంగా 1,78,55,66,940 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.