న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 3451 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితులు 4,31,02,194కు చేరారు. ఇందులో 4,25,57,495 మంది కోలుకోగా, 5,24,064 మంది మృతిచెందారు. మరో 20,635 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 40 మంది మరణించగా, 3079 మంది డిశ్చార్జీ అయ్యారు.
ఇక మొత్తం కేసుల్లో 0.05 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.7 శాతం మంది కోలుకోగా, 1.22 శాతం మంది కరోనాకు బలయ్యారని తెలిపింది. దేశవ్యాప్తంగా 1,90,20,07,487 కరోనా డోసులను పంపిణీ చేశామని, శనివారం ఒకేరోజు 17,39,403 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.