న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 290 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 3,92,864 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3,30,58,843కు చేరింది. ఇప్పటి వరకు 3,22,24,937 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 4,41,042కు చేరింది. ఇప్పటి వరకు 69,90,62,776 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే కేరళలో 19,688 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 135 మంది మరణించారు.