న్యూఢిల్లీ : ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 295 మంది మరణించారు. ఒక్క కేరళలోనే నిన్న 19,653 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 152 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశ వ్యాప్తంగా కరోనా నుంచి మరో 43,938 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,18,181 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 33,478,419కి చేరింది. మరణాల సంఖ్య 4,45,133కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 80.85 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
India reports 30,256 fresh cases of #COVID19, 43,938 recoveries, and 295 deaths in the last 24 hours
— ANI (@ANI) September 20, 2021
Total cases: 33,478,419
Total Active cases: 3,18,181
Total Recoveries: 3,27,15,105
Total Death toll: 4,45,133
Total vaccination : 80,85,68,144 (37,78,296 in last 24 hours) pic.twitter.com/MTf1Qrrxwh