న్యూఢిల్లీ, మార్చి 30: దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,016 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. గత ఆరు నెలల కాలంలో నమోదైన కేసులలో ఇదే గరిష్టం.
గత ఏడాది అక్టోబర్ 2న 3,375 కేసుల తర్వాత ఇదే అత్యధిక కేసుల నమోదు. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసులు 13,509కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. కొవిడ్తో మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.