న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,71,202 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 314 మంది మరణించారు. నిన్నటి కంటే 2,369 కేసులు అధికంగా నమోదు అయ్యాయి.
మరో 1,38,331 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 15,50,377 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. ఇక ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,743కు చేరింది.