న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 277 మంది వైరస్ బారినపడి మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. 28,246 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,48,339గా ఉంది. ఇక వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 89,02,08,007 మందికి కరోనా టీకా ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 64,40,451 మందికి టీకా వేశారు.