న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 20 మంది మరణించినట్లు పేర్కొన్నది. కరోనా మహమ్మారి నుంచి మరో 2,911 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 19,137 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 189.41 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు.
#COVID19 | India reports 2,568 fresh cases, 2,911 recoveries and 20 deaths in the last 24 hours. Active cases 19,137 pic.twitter.com/zh9viRBAER
— ANI (@ANI) May 3, 2022