న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 22,279 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. అయితే నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 14 శాతం తగ్గింది. 60298 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో దేశంలో కొత్తగా 325 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.8 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య 5,11,230. ఇక ఇప్పటి వరకు 175.03 కోట్ల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు.