న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 2.34 లక్షల పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా 2.09 లక్షల కేసులు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 10 శాతం తక్కవని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా పాజిటివీటీ రేటు కూడా తగ్గుతూ వస్తున్నదని తెలిపింది. కాగా, దేశంలో కరోనా మొదటి కేసు నమోదై ఆదివారం నాటికి రెండేండ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి మూడు దశల్లో మహమ్మారి విజృంభించింది. ప్రస్తుతం మూడో వేవ్ కొనసాగుతున్నది.
దేశవ్యాప్తంగా కొత్తగా 2,09,918 కరోనా కేసులు మోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,13,02,440కు చేరాయి. ఇందులో 3,89,76,122 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 18,31,268 కేసులు కరోనా నుంచి కోలుకోగా, 4,95,050 మంది మృతిచెందారు.
కాగా, గత 24 గంటల్లో కొత్తగా 959 మంది మరణించగా, 2,62,628 మంది మహమ్మారిబారి నుంచి బయటపడ్డారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 4.43 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉందని పేర్కొన్నది.