India Corona | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 2,01,690 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 175 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,131కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,570 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా 5,30,707 మంది మృతి చెందారు.
ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.11 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.