న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,862 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,391 మంది కరోనా నుంచి కోలుకోగా, 379 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,40,37,592 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 2,03,678 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య – 3,33,82,100. కొవిడ్ మరణాల సంఖ్య 4,51,814కు చేరింది.
కేరళలో నిన్న ఒక్కరోజే కొత్తగా 9,246 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 96 మంది మరణించారు. గత 24 గంటల్లో 30,26,483 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 97 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు.
India reports 16,862 new #COVID cases, 19,391 recoveries and 379 deaths in last 24 hours, as per Union Health Ministry.
— ANI (@ANI) October 15, 2021
Total cases: 3,40,37,592
Active cases: 2,03,678
Total recoveries: 3,33,82,100
Death toll: 4,51,814
Total Vaccination: 97,14,38,553 (30,26,483 in last 24 hrs) pic.twitter.com/HL6ZofzuQl