న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మాత్రం పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 1,259 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 35 మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా నుంచి మరో 1,705 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 15,378 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 183.53 కోట్ల టీకాలను పంపిణీ చేశారు. నిన్న 1270 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
India registers 1,259 new #COVID19 cases, 35 deaths, and 1,705 recoveries, in the last 24 hours; Active cases stand at 15,378 pic.twitter.com/ZB8Y8aG4l1
— ANI (@ANI) March 29, 2022