న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి క్షీణించింది. దీంతో కొత్తగా నమోదవులున్న కేసులు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఐదు వేల లోపే నమోదవుతు వస్తున్నాయి. తాజాగా 4194 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,29,84,261కి చేరాయి. ఇందులో 4,24,26,328 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,15,714 మంది మృతిచెందగా, 42,219 మంది చికిత్స పొందుతున్నారు.
కాగా, గత 24 గంటల్లో 6,208 కోలుకోగా, 255 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.10 శాతం మాత్రమేనని, 98.70 శాతం మంది డిశ్చార్జీ అయ్యారని, 1.20 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక 1,79,72,00,515 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.