న్యూఢిల్లీ, జూన్ 13: 2004 నుంచి ప్రతీ వంద మంది భారతీయుల్లో 18 మంది డాటా తస్కరణకు గురయ్యింది. డాటా లీకేజీలో భారత్ ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉన్నది. ఈ మేరకు భారతీయుల డాటా భద్రతపై సర్ఫ్షార్క్ హెచ్చరికలను ఉటంకిస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరుల సమాచారాన్ని సేకరించే కంపెనీలు ఆ డాటాను భారత పరిధిలోనే నిల్వ చేయాలని పేర్కొంది. పౌరుల సమాచార భద్రత పట్ల తగిన చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలకు సూచించింది.